
కులగణనను కేంద్రం ఆమోదించడం సంతోషం
● డీసీసీ అధ్యక్షుడు అశోక్
ములుగు: రాహుల్గాంధీ సూచనల మేరకు కేంద్రం ప్రభుత్వం కులగణనను దేశ వ్యాప్తంగా అమలు చేయడాన్ని ఆమోదించడం సంతోషకరమని డీసీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణను తొలిసారిగా అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్రెడ్డి, ఇర్సవడ్ల వెంకన్న, బీసీ సెల్ అధ్యక్షుడు రవియాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మావిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.