
పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?
శుక్రవారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
పడవలో ప్రజలను వాగు దాటిస్తున్న సిబ్బంది(ఫైల్)
2023 జూలైలో వరదలకు కొట్టుకుపోయిన కొండాయి బ్రిడ్జి
ఏటూరునాగారం: ఏజెన్సీలోని పలు గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రతీ వర్షాకాలంలో పడవ ప్రయాణం తప్పడం లేదు. అందులో వర్షాకాలం వచ్చిందంటే గిరిజనుల గుండెల్లో భయాందోళన నెలకొంటుంది. 2023జూలైలో కురిసిన భారీ వర్షాలకు కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి హైలెవల్ బ్రిడ్జి కుంగిపోయి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో 8మంది జల సమాది అయ్యారు. ఈ విషాధ ఘటనను మరిచిపోలేని ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
కొట్టుకుపోయిన మట్టిరోడ్డు
నాలుగు నెలల క్రితం జంపన్నవాగులో ఇసుక కాంట్రాక్టర్ తన లారీలు నడిచేందుకు తాత్కాలిక మట్టి రోడ్డు వేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు బుధవారం కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజులకాలనీ, ఐలాపురం గ్రామాలకు వెళ్లేందుకు రవాణా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటు గ్రామాల్లోనే మగ్గిపోతున్నారు.
రబ్బరు బోటు ఏర్పాటు
మట్టి రోడ్డు తెగిపోవడంతో ప్రజల రవాణా కోసం జంపన్నవాగు వద్ద ఫైర్ శాఖకు చెందిన ఎయిర్ రబ్బర్ బోటును ఏర్పాటు చేసి ప్రజలను జంపన్నవాగు దాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఫైర్ సిబ్బంది అక్కడే ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేసుకొని ఆపదలో ఉన్న వారిని బోట్లో వాగు దాటిస్తున్నారు. ప్రజల అవసరం మేరకు పడవను నడిపిస్తున్నారు.
మొదలైన డ్రిల్లింగ్
కొండాయి బ్రిడ్జికి మంత్రి సీతక్క ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.16.50 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిని మంజూరు చేశారు. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ పనులు చేపట్టిన మరుసటి రోజు వాగు రావడంతో పనులు వెనుకంజ వేశాయి. ఈ బ్రిడ్జి పనులు పూర్తి కావాలంటే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అప్పటి వరకు గిరిజనులు జంపన్నవాగును పడవలో దాటడం లేదా ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
న్యూస్రీల్
వంతెన నిర్మాణం కోసం
ఎదురుచూస్తున్న ప్రజలు
మొదలైన డ్రిల్లింగ్ పనులు
అకాల వర్షాలతో వెనకడుగు
ఎలిశెట్టిపల్లి వద్ద పడవ ఏర్పాటు
మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి వాగు వద్ద మోటారు పడవను ఏర్పాటు చేశారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో జంపన్నవాగు ఉధృతి పెరగడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర సేవల కోసం కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు పడవను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐ కిరణ్కుమార్ తెలిపారు. ఆయన వెంట నగేష్, కృష్ణతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?

పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?

పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?

పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?