
బ్లాస్టింగ్లతో భయాందోళన
మల్హర్: తాడిచర్ల ఓసీపీలోని బ్లాస్టింగ్లో రోజురోజుకు భయందోళనల మధ్య జీవనం సాగిస్తున్నామని పెద్దతాడిచర్ల గ్రామానికి చెందిన అనుమాల లక్ష్మ య్య, దేవాక్క దంపతులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓసీ ప్రాజెక్టు దగ్గరగా ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల పైకప్పులు పగలడంతో పాటు, గోడలకు బీటలు వారి కూలి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లోని పక్క గది రేకులు కింద పడడంతో పరగులు తీశామని వాపోయారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగపోయిన మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయంగా ఉందని వారు తెలుపుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి నాయ్యం చేయడంతో పాటు డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లు సేకరించాలని కోరారు.