
రైతులు ఆందోళన చెందొద్దు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో హనుమకొండ జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపాలని అధికారులను ఆదేశించా రు. యాసంగి సీజన్లో జిల్లా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులను నిలిపి వేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్ధార్సింగ్ పాల్గొన్నారు.