మానవాళి మనుగడకు నీరే ఆధారం | - | Sakshi
Sakshi News home page

మానవాళి మనుగడకు నీరే ఆధారం

Mar 23 2025 9:19 AM | Updated on Mar 23 2025 9:14 AM

గోవిందరావుపేట: మానవళి మనుడగకు నీరే ఆధారమని జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని చల్వాయి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో యువతరం యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భూగర్భ జలశాఖ ములుగు సహకారంతో పాఠశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూగర్భ జలాలను పొదుపు చేయలేకపోతే భవిష్యత్‌ తరాలకు ముప్పు తప్పదని అన్నారు. ఎంపీడీఓ జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు, నదులను సంరక్షించుకోవడం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు వారి నిత్య జీవితంలో నీటి ప్రాముఖ్యతను గుర్తించి నీటి పొదుపును పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ శరత్‌ బాబు, చల్వాయి గ్రామ కార్యదర్శి చుంచు భారతి, కేజీబీవీ ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి, యువతరం యూత్‌ అద్యక్షుడు దశరథం, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement