ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. క్యాంపు కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది కార్యాలయం లోపల నాగుపామును గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో మేడారం సమీపంలోని కొత్తూరు వైన్షాపులో పని చేస్తున్న నగేష్ కార్యాలయానికి వచ్చి ప్లాస్టిక్ డబ్బాలో నాగుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నగేష్ను సమ్మక్క పూజారులు సిద్దబోయిన స్వామి, సిద్దబోయిన రమేష్, ఆదివాసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం సిబ్బంది అభినందించారు.