‘సికిల్‌సెల్‌’పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘సికిల్‌సెల్‌’పై అవగాహన కల్పించాలి

Mar 21 2025 1:16 AM | Updated on Mar 21 2025 1:15 AM

ములుగు: సికిల్‌సెల్‌ రక్తహీనత పట్ల గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో గురువారం ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు సికిల్‌సెల్‌ ఎనిమియాపై శిక్షణ ఇచ్చి మాట్లాడారు. 2047 నాటికి సికిల్‌సెల్‌ నిర్మూలించడానికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అనువంశికంగా సంక్రమింపజేసే వ్యక్తుల వివాహాల కారణంగా సికిల్‌సెల్‌ వ్యాధికి గురికాకుండా నియంత్రణ పద్ధతులు పాటిస్తే అరికట్టవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి ట్రైనర్లు గణేశ్‌, శ్రవణ్‌, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలను వెల్లడించారు. ఎక్కువ నీటిని తీసుకుంటూ పోషకాహారం తీసుకోవడంతో పాటు ఫోలిక్‌యాసిడ్‌ ట్యాబ్లెట్లు తీసుకోవాలన్నారు. తీవ్రమైన వేడి, చలి ప్రాంతాలకు వెళ్లకూడదని తదితర సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు చంద్రకాంత్‌, పవన్‌కుమార్‌, రణధీర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జనరల్‌ మెడిసిన్‌ నిపుణుడు పవన్‌కుమార్‌, డాక్టర్‌ సురేందర్‌, డీడీఎం ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement