వసతుల కల్పనపై ఆదేశాలు రాలేదు.. | - | Sakshi
Sakshi News home page

వసతుల కల్పనపై ఆదేశాలు రాలేదు..

Mar 21 2025 1:16 AM | Updated on Mar 21 2025 1:15 AM

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పని ప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాకపోతే పని జరిగే ప్రదేశంలో గ్రామ పంచాయతీల తరఫున సౌకర్యాలు కల్పించాలని సూచించాం. కొన్ని చోట్ల టెంట్లకు బదులు గ్రీన్‌ షెడ్లు వేస్తున్నారు. కూలీలు ఉదయం 6నుంచి 11గంటల వరకు పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకునేలా ముందుగానే మార్కింగ్‌ చేయిస్తున్నాం. వ్యవసాయ కాల్వల పూడికతీత పనులు చేపడుతాం. తవ్విన మట్టిన పొలాలకు తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం చేచిచూస్తున్నాం. మొత్తానికి కొలతల ప్రకారం పనిచేసే కూలీలకు పూర్తిస్థాయి కూలి గిట్టుబాటు అవుతుంది.

– సంపత్‌రావు, డీఆర్డీఓ

15 రోజులు పనులు చేసిన

ఏటూరునాగారం మండలంలోని క్రాస్‌ రోడ్డు నుంచి ఎర్రకుంట చెరువుకు వెళ్లి 15 రోజు లుగా ఉపాధిహామీ పనులు చేశాం. పని ప్రదేశంలో ఎలాంటి వసతులు లేవు. నీళ్లు కూడా లే వు. చేసిన 15 రోజుల డబ్బులు కూడా రాలేదు. మండుటెండల్లో కాయకష్టం చేసినప్పుడు అధికారులు స్పందించి నీడ కోసం టెంట్లు వేయాలి. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి

– వట్టం శాంత, ఏటూరునాగారం

వసతుల కల్పనపై ఆదేశాలు రాలేదు..
1
1/1

వసతుల కల్పనపై ఆదేశాలు రాలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement