ములుగు రూరల్: ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటియూ జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్, ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టర్ టీఎస్.దివాకరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆశ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు అందించినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గఫూర్, సద్దాం హుస్సేన్, రవి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు మంజూల, ప్రభావతి, రాధ, కవిత, రజిత, సంధ్య, శ్రావ్య, శోభ, రాజ్యలక్ష్మీ, దేవి, సత్యవతి, నాగమణి, సరూప, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి
కలెక్టరేట్ ఎదుట ధర్నా