వాజేడు: మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద గతంలో మంజూరైన మోడికుంట ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని కోరుతూ మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్కకి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలపక్షం నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో మోడికుంట ప్రాజెక్టు మంజూరైనా ఇంత వరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని తెలిపారు. దీంతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కొప్పునూరు సమీపంలో ఉన్న గుడ్లవాగు ప్రాజెక్టు మరమ్మతులకు గురైందని దానిని బాగుచేయించాలని సీఎంను, మంత్రులను కోరినట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులపై అఖిల పక్షంతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించినట్లు వెల్లడించారు.