రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 19 2025 1:15 AM | Updated on Mar 19 2025 1:13 AM

ములుగు: ములుగు జిల్లా రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ మంగళవారం హైదరాబాద్‌లోని సివిల్‌ సప్లయీస్‌ కార్పోరేషన్‌ భవనంలో కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌కు మంగళవారం పూలమొక్క అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూలంకషంగా చర్చించారు. ప్రతీ విషయాన్ని ఓపికగా విన్న కమిషనర్‌ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ప్రవీణ్‌ తెలిపారు.

ఎస్టీ బాలుర వసతి

గృహం తనిఖీ

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించడంతో పాటు బాత్‌రూంలు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వండుతున్న వంటలను పరిశీలించి ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వార్డెన్‌ను ఆదేశించారు.

అటవీ అధికారులకు దొరికిన కొండ గొర్రెపిల్ల

గోవిందరావుపేట: మండల పరిధిలోని బుస్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని రేగుల కుంటలో అటవీ అధికారులకు కొండ గొర్రెపిల్ల లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. బుస్సాపూర్‌ అటవీ ప్రాంతానికి ఫారెస్ట్‌ అధికారులు ఫీల్డ్‌పై రేగులకుంట వద్దకి చేరుకోగానే కాలుకి గాయమై కొండగొర్రె పిల్ల కనిపించింది. దాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు తీసుకొచ్చి కాలుకి చికిత్స చేయించి పస్రా ఎఫ్‌ఆర్‌ఓ మాధవీశీతల్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె ఆదేశాల మేరకు వరంగల్‌లోని జూపార్క్‌కు క్షేమంగా తరలించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి వేణుగోపాల్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు టి.దీప్‌లాల్‌, బి.అర్జున్‌ పాల్గొన్నారు.

రామప్పలో

అమెరికా దేశస్తులు

వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం అమెరికాకు చెందిన షేమ్‌, ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప అందాలు బాగున్నాయని కొనియాడారు. సరిగమలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని మీటుతూ ముగ్ధులయ్యారు. రామప్ప శిల్పాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్‌ చేస్తూ అందాలను తిలకించారు.

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
1
1/3

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
2
2/3

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
3
3/3

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement