ములుగు రూరల్: అడవి పందుల దాడితో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారని వెంటనే అధికారులు పంట రక్షణ చర్యలు చేపట్టాలని రైతు ఉత్పత్తి సంఘం జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి అంజిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని దేవగిరిపట్నం, పొట్లాపూర్, పులిగుండం, జగ్గన్నపేట, కొత్తూరు, పంచోత్కులపల్లిలో వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు పంటల వైపు రాకుండా ఫినిషింగ్ చేయాలని కోరారు.
రైతు ఉత్పత్తి సంఘం జిల్లా కన్వీనర్
అంజిరెడ్డి