ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి– మల్యాల గ్రామాల బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.16కోట్లు మంజూరు చేసింది. ఆదివారం కొండాయి జంపన్నవాగులో రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల కోసం పనులను ప్రారంభించారు. గతంలో వచ్చిన వరదల కారణంగా కూలిపోయిన పాత వంతెన పక్కనే నూతన వంతెన నిర్మాణానికి అధికారులు పిల్లర్ల మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన వద్ద గాయత్రి కన్స్ట్రక్షన్కు చెందిన కార్మికులు ఇసుకలో పిల్లర్ మార్కింగ్ ప్రాంతంలో బోరింగ్ పైపుల ద్వారా తవ్వకాలు చేపట్టారు. 20మీటర్లు వరకు పూర్తిగా ఇసుక ఉందని, ఎలాంటి మట్టి లభించడం లేదన్నారు. కాగా 20మీటర్లలో లభించిన వివిధ ఇసుక శాంపిళ్లను హనుమకొండలోని ల్యాబ్కు ఎప్పటికప్పుడు పంపిస్తున్నట్లు తెలిపారు. గతంలోని బ్రిడ్జితో పోలిస్తే పొడవు, వెడల్పు ఎక్కువగా ఉండనుంది. ఈ సారి బ్రిడ్జి 186మీటర్ల పొడవు, 5నుంచి 7పిల్లర్లు పడే అవకాశం ఉంది. మంత్రి సీతక్క ప్రత్యేకమైన చొరవతో పనులు మరింత వేగవంతంగా చేసేందుకు అధికారులు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలం వరకు బ్రిడ్జి ని ర్మాణం పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా 20మీటర్ల వరకు ఇసుక ఉండడంతో బ్రిడ్జి నా ణ్యతపై ఆందోళన నెలకొంది. బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెస్తున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీతో పాటు మేడారం వెళ్లే ప్ర జలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం తో ఆగ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.
రూ.16 కోట్లు
మంజూరు చేసిన ప్రభుత్వం
ముమ్మరంగా మట్టి నమూనాల సేకరణ