కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన శ్రీనిధి ఆర్ట్స్‌ | Srinidhi Arts Announced New Film And Shooting Begins In Chennai | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన శ్రీనిధి ఆర్ట్స్‌

May 15 2022 2:11 PM | Updated on May 15 2022 2:12 PM

Srinidhi Arts Announced New Film And Shooting Begins In Chennai - Sakshi

బాలీవుడ్‌లో పలు చిత్రాలు, వాణిజ్య ప్రకటనలను రూపొందించిన శ్రీ నిధి ఆర్ట్స్‌ అధినేతలు ఎం.జె.రమణన్, జానీ దుగల్, వినంబర శాస్త్రి తాజాగా తమిళం, తెలుగు భాషలలో ఓ వినోద భరిత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.జె.రమణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుష్యంత్, వివేక్‌ ప్రసన్న, తెలుగు నటుడు శ్రీనివాస్‌రెడ్డి, హిందీ నటుడు రవి కిషన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ఆరంభించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ సతీష్‌  కుమార్‌ ఛాయాగ్రహణం, అంజాద్‌ నదీమ్‌ అమీర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement