సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్లో ఎంట్రీ సినిమా ఏక్ దిన్ (ఒక రోజు).. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న తెలుగులో కూడా విడుదల కానుంది. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. సాయి పల్లవి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతిగా కనిపించనుంది. అయితే, ప్రేమించిన అమెతో ఒక్కరోజు అయిన సంతోషంగా సమయం గడపాలని హీరో జునైద్ అనుకుంటాడు. సాయి పల్లవి హిందీలో నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తోంది.


