Radhe Shyam: లవ్‌ సాంగ్‌ కోసం ముంబైలో సెట్‌ | Prabhas agrees to do another song with Pooja Hegde | Sakshi
Sakshi News home page

Radhe Shyam: లవ్‌ సాంగ్‌ కోసం ముంబైలో సెట్‌

May 24 2021 1:46 AM | Updated on May 24 2021 11:07 AM

Prabhas agrees to do another song with Pooja Hegde - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. ఒక ప్రేమ పాట మినహా ఈ చిత్రం పూర్తయిందని సమాచారం. అయితే ఇప్పటికే రొమాంటిక్‌ సాంగ్స్‌ చిత్రీకరించడంతో తాజా కోవిడ్‌ పరిస్థితుల్లో ఆ పాట చిత్రీకరణను విరమించుకున్నారని టాక్‌. కానీ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న టి సిరీస్‌ అధినేతలు ఆ ప్రేమ పాట ఉంటేనే బాగుంటుందని భావించారట.

సో.. ఈ పాటను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ పాట కోసం ముంబయ్‌లో సెట్‌ వేయాలని ఆలోచిస్తున్నారట. ఇక ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో వచ్చే ఆసుపత్రి సన్నివేశాలు, షిప్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయట. ఈ ఏడాది జూలై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement