విజయ్.. నీ స్వార్థం కోసం ఇంకెంతమంది?.. డ్రాగన్ హీరోయిన్ ఆగ్రహం! | kollywood actress Kayadu Lohar tweet about vijay tvk karur Incident | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: 'నా సన్నిహితులను కోల్పోయా.. అంతా మీ రాజకీయ స్వార్థం వల్లే'

Sep 28 2025 1:18 PM | Updated on Sep 28 2025 1:48 PM

kollywood actress Kayadu Lohar tweet about vijay tvk karur Incident

తమిళనాడు జరిగిన విషాదంపై డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ తీవ్రస్థాయిలో స్పందించింది. కరూర్‌లో జరిగిన దుర్ఘటనలో అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీనంతటికీ కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌.. మీ స్టార్‌డమ్‌ కోసం ప్రజలు ఎందుకు బలవ్వాలని ప్రశ్నించింది. మీ ఆకలికి ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారని నిలదీసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేసింది.  కాగా.. నిన్న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజీనీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్‌ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. ఈ ఘటనతో తన గుండె పగిలిందని ట్వీట్‌ చేశారు. వారిని ఓదార్చేందుకు కూడా మాటలు రావడం లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున రూ.20 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement