టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇంట వినాయక నిమజ్జనం వేడుక నిర్వహించారు. గణనాథుని పూజలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి వీడ్కోలు పలికారు. మహేశ్ బాబు కూతురు సితార వినాయకుడిని తన చేతుల మీదుగా ఎత్తుకుని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని మోస్ట్ అడ్వెంచరస్గా అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.
Superstar #MaheshBabu ఇంట్లో గణేషుడి నిమజ్జనం ❤️🙏#Varanasi #SitaraGhattamaneni #NamrataShirodkar #TeluguFilmNagar pic.twitter.com/XhZKRHvwRC
— Telugu FilmNagar (@telugufilmnagar) September 17, 2026


