ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి | Chiranjeevi Message On SP Balu Heakth Condition | Sakshi
Sakshi News home page

ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి

Aug 19 2020 4:41 PM | Updated on Aug 19 2020 6:40 PM

Chiranjeevi Message On SP Balu Heakth Condition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గాన గంధర్వుడు ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి  చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎస్పీ బాలుకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే బాలు ఆరోగ్యం మెరుగుపడిందనే వార్తలు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులను ఆనందానికి గురిచేస్తున్నాయి. మరోవైపు  బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేయగా.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విటర్‌లో ఎస్పీబీ తొందరగా కోలుకోవాలని వీడియో రూపంలో తెలియజేశారు. (బాలు వార్డులో ఆయన పాటల ప్రసారం). 

బాలు కోలుకుకుంటున్నారన్న వార్త తనకు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. బాలులో సినిమా పరంగానే కాకుండా కుటుంబ పరంగానూ ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. చెన్నైలో పక్క పక్క వీదుల్లోఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి గురించి శైలజ, వసంత, శుభలేఖ సుధాకర్‌కు ఫోన్ చేసి రోజూ తెలుసుకొంటున్నానని తెలిపారు. త్వరగా బాలు కోలకొని కళామతల్లికి మరింత సేవలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అందరి ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులు ఆయన్ను కోలుకొనేలా చేస్తుందన్నారు. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్‌ ధమాకా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement