ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా.. భాగీ-4 సడెన్‌గా స్ట్రీమింగ్‌ | Baaghi 4 movie OTT streaming details locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా.. భాగీ-4 సడెన్‌గా స్ట్రీమింగ్‌

Oct 17 2025 4:53 PM | Updated on Oct 17 2025 5:17 PM

Baaghi 4 movie OTT streaming details locked

బాలీవుడ్‌ హిట్‌ ఫ్రాంచైజీలో భాగీ సినిమాకు ఎక్కువగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. సెప్టెంబర్‌ 5న విడుదలైన భాగీ4 సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన ఈ భారీ యాక్షన్‌ చిత్రంలో హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్‌ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటించారు. మితిమీరిన రక్తపాతంతో నిండిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం నిరాశపరచలేదని చెప్పాలి.

అమెజాన్‌ ప్రైమ్‌లో సడెన్‌గా భాగీ-4 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని అద్దె ప్రాతిపదికలో చూడొచ్చు. రూ. 349 అధనంగా చెల్లించి భాగీ-4 చూడొచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ‘భీమా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష  ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో  సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించారు.  'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు.  'భాగీ 2'లో హీరోయిన్‌గా  దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement