ప్రజల మన్ననలు పొందాలి
మాజీ మంత్రి హరీశ్రావు
గజ్వేల్: సర్పంచ్లుగా ఎన్నికైనవారు ప్రజల మన్ననలు పొందాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొ లివిడత ఎన్నికల్లో గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్ సర్పంచ్గా ఎన్నికై న ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్రెడ్డి, వార్డుసభ్యులు హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


