నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Sep 3 2025 7:57 AM | Updated on Sep 3 2025 7:57 AM

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

నిజాంపేట(మెదక్‌): నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఆధ్యక్షుడు శంకర్‌ దయాళ్‌ చారి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం నిజాంపేట మండల ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా అజ్గర్‌, ఉపాధ్యక్షుడుగా నవీన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా జీడీ. చంద్రకాంత్‌గౌడ్‌, కోశాధికారి బండారి సిద్ధరాములు, సహాయ కార్యదర్శిలుగా బాలరాజ్‌, శ్రీకాంత్‌, సలహాదారులుగా భైరవరెడ్డి, భరత్‌ రెడ్డి, ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడుగా అజ్గర్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత్రికేయులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌, ఇళ్ల స్థలాల విషయంలో అందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement