కొనుగోళ్లు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగవంతం చేయండి

May 2 2025 4:16 AM | Updated on May 2 2025 4:16 AM

కొనుగోళ్లు వేగవంతం చేయండి

కొనుగోళ్లు వేగవంతం చేయండి

అదనపు కలెక్టర్‌ నగేష్‌
నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కొల్చారం(నర్సాపూర్‌)/నర్సాపూర్‌ రూరల్‌/ కౌడిపల్లి: ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ రైస్‌ మిల్లుల యజమానులు, అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. రైస్‌ మిల్లుకు ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్‌లోడింగ్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైస్‌ మిల్లుల్లో ధాన్యం తూకం, రవాణా, రైస్‌ మిల్లుల్లో అన్‌ లోడింగ్‌ కోసం అదనంగా లేబర్‌ను పెట్టుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌, తహసీల్దార్‌ గఫార్‌ మియా, ఆర్‌ఐ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు. అలాగే నర్సాపూర్‌ మండలం కాగజ్‌ మద్దూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించా రు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు.

మెదక్‌ మున్సిపాలిటీ: పట్టణ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు, ఔరంగాబాద్‌, అవుసులపల్లి పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వి ద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏడీఈ మోహన్‌బాబు, టౌన్‌ ఏఈ నవీన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వార్డుల పరిధిలో విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు పలు ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు సహ కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement