ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి

Dec 16 2025 11:46 AM | Updated on Dec 16 2025 11:46 AM

ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి

ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలి

మందమర్రిరూరల్‌: సింగరేణి ఉద్యోగులు రక్షణ నియమాలు పాటించాలని జీఎం(ఎంఎస్‌), సేఫ్టీ కమిటీ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. సింగరేణి 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియాలోని కేకే–5 గనిని ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సేఫ్టీ కమిటీ తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ నియమాలు పాటిస్తే విధి నిర్వహణలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందించే ప్రథమ చికిత్సపై తెలియజేస్తూ రక్షణపై ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్‌, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ భూశంకరయ్య, కేకే–5 గని మేనేజర్‌ శంభునాథ్‌పాండే, సేఫ్టీ కమిటీ సభ్యులు, అధికారులు, యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement