దివ్యాంగులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను ప్రోత్సహించాలి

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

దివ్యాంగులను ప్రోత్సహించాలి

దివ్యాంగులను ప్రోత్సహించాలి

శ్రీరాంపూర్‌: దివ్యాంగులను ప్రోత్సహించాలని శ్రీరాంపూర్‌ జీఎం ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరాంపూర్‌ ప్రగతి మైదానంలోని సీఈఆర్‌ క్లబ్‌లో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని తెలిపారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్‌ బాజీసైదా, డీజీఎం(పర్సనల్‌) ఎస్‌.అనిల్‌కుమార్‌, స్పోర్ట్స్‌ గౌరవ కార్యదిర్శి పాల్‌ సృజన్‌, కోఆర్డినేటర్‌ నరసయ్య, ఇండోర్‌ కేప్టెన్‌ తోట సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement