
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు.