శాంతిభద్రతలు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు కాపాడాలి

Aug 31 2025 7:26 AM | Updated on Aug 31 2025 7:26 AM

శాంతిభద్రతలు కాపాడాలి

శాంతిభద్రతలు కాపాడాలి

లక్సెట్టిపేట: ప్రజల శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కృషి చేయాలని డీసీపీ భాస్కర్‌ అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వినాయక నిమజ్జనానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు అంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్‌, సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement