రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

Aug 31 2025 7:26 AM | Updated on Aug 31 2025 7:26 AM

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

చెన్నూర్‌రూరల్‌: కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో మునిగిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని నాగపూర్‌ గ్రామంలో నీటమునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వెంకటేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇప్పటికి మూడు సార్లు పంటలు మునిగిపోతే ఏ ఒక్క అధికారి, నాయకుడు వచ్చి చూసిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం కరకట్ట కట్టించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్‌, లక్ష్మీనారాయణరెడ్డి, జాడి తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement