
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్ద గల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలకు వేదికగా నిలిచింది. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న ప్రారంభమైన పోటీలు 20వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అండర్–19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఈనెల 20వరకు మె యిన్ డ్రా పోటీలు కొనసాగనున్నాయి. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి 10మంది అంపై ర్లు, ఒక రిఫరీ, ఒక మ్యాచ్ కంట్రోలర్ హాజరయ్యా రు. జిల్లా క్రీడలశాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచి ర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిశోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేశ్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. కాగా, రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నా యి. శుక్రవారం ప్రారంభమైన మెయిన్ డ్రా పోటీల కు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్రెడ్డి, ఎంపీ గోడం నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, సీనియర్ నాయకులు సత్యనారాయణగౌడ్, రావుల రాంనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు.