
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
తాండూర్: ఇసుక ట్రా క్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన విఘ్నేష్ (21) శనివారం తెల్ల వారుజామున తమ సొంత ట్రాక్టర్లో ఇసుక నింపుకుని టేకులపల్లి నుంచి అచ్చలాపూర్వైపు వస్తుండగా అదుపుతప్పి ఒర్రెలో పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
ముధోల్: ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. మండలంలోని వడ్తాలా గ్రామానికి చెందిన పవన్కుమార్ (28) ఈనెల 18న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
లారీ బోల్తా
సాత్నాల: భోరజ్ మండల కేంద్రంలోని 44వ అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్ట్ వద్ద శనివారం అదుపుతప్పి లారీ బోల్తా పడింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన మతిన్ లారీలో జైపూర్ నుంచి చైన్నెకి ఎల్ఈడీ బల్బులు రవాణా చేస్తుండగా భోరజ్ చెక్పోస్ట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చెక్పోస్ట్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మూడిళ్లలో చోరీకి యత్నం
ముధోల్: మండల కేంద్రంలోని పలు కాలనీల్లో శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి యత్నించినట్లు ఎస్సై బిట్లా పెర్సిర్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు రాత్రిపూట తాళం వేసిన ఇళ్లలో చోరీకి యత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీ కాలేదన్నారు. బాధితులు సట్లొల్ల గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. చోరీకి యత్నించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.