
సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే విమర్శలు
ఆదిలాబాద్రూరల్: మంత్రి సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు ఆమైపె లేనిపోని విమర్శలు చేస్తున్నార ని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. శనివారం మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో గల కుమురం భీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి సీతక్కను ధూషిస్తున్నారన్నారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెందూర్ దాదిరావు, వెట్టి మనోజ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్రా పాల్గొన్నారు.