
పుట్టినరోజే ఆగిన ఊపిరి
● 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
ఆదిలాబాద్టౌన్: నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడిన ఓ తల్లికి తీరని గర్భశోకం మిగి లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్ల లను రోడ్డు ప్రమాదం కబళించింది. పక్షం రోజుల క్రితం ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడిని, తల్లిని కోల్పోయిన సృజనిత శనివారం కుమార్తెను కూడా కోల్పోయింది. ఉన్న ఇద్దరు పిల్లలు దూరం కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. దైవదర్శనానికి వస్తుండగా ఈనెల 16న బిర్సాయిపేట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. అందులో ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఈర్ల రా జు, అతని భార్య సృజనిత, అత్తమ్మ గంట విజయ, కు మారుడు సహర్ష్తో పాటు కుమార్తె అద్యశ్రీ (12) ప్ర యాణించారు. సహర్ష్, గంట విజయ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అద్యశ్రీ ని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 12 రోజుల పా టు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి శనివారం తన పుట్టిన రోజునాడే తనువు చాలించింది. పుట్టిన రోజునాడే చిన్నారి దూరం కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే చిన్నారుల మరణంతో కాలనీలోనూ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివా రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.