
కార్మికులకు ఆరోగ్య పరీక్షలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని నిర్మాణ రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్ష కార్డు అందజేస్తున్నారు. కార్మిక శాఖలో నమోదైన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా.. ఆ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి కార్డు అందజేస్తున్నట్లు సీఎస్సీ హెల్త్ కేర్ కోఆర్డినేటర్ రవితేజ తెలిపా రు. మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయంలో, లక్సెట్టిపేట, చెన్నూరు, భీమి ని, భీమిని మండలం లక్ష్మీపూర్, మంచిర్యాలలోని రాజీవ్నగర్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు.