ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు | - | Sakshi
Sakshi News home page

ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు

Dec 10 2025 9:27 AM | Updated on Dec 10 2025 9:27 AM

ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు

ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు

సాధారణ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కాత్యాయనీదేవి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్‌ విజయేందిరతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీపీ ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే గండేడ్‌, నవాబ్‌పేట, రాజాపూర్‌, మహమ్మదాబాద్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ఈ ఐదు మండలాల్లో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులోకి వచ్చిందని, ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడటం నిషేధమని చెప్పారు. 11వ తేదీ పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

ర్యాండమైజేషన్‌ పూర్తి

మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన మూడో విడత ర్యాండమైజేషన్‌ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి సమక్షంలో కలెక్టర్‌ విజయేందిర నిర్వహించారు. ఈ జీపీల్లో పోలింగ్‌ కేంద్రాలకు విధులు నిర్వహంచే విధంగా ర్యాండమైజేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ట్రైని డీపీఓ నిఖిలశ్రీ, ఆర్‌డీఓ నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement