ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,739
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. అత్యధికంగా 13,376 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,689 ధరలు పలికాయి. హంస గరిష్టంగా రూ.1,821, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,951, కనిష్టంగా రూ.1701, పత్తి గరిష్టంగా రూ.6,177, కనిష్టంగా రూ.4,379, వేరుశనగ రూ.7,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,671, కనిష్టంగా రూ.2,359, సోనామసూరి గరిష్టంగా రూ.2,353, కనిష్టంగా రూ.2,129గా ధరలు పలికాయి.


