సమన్వయంతో మెలగాలి.. | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో మెలగాలి..

Sep 12 2025 6:48 AM | Updated on Sep 12 2025 6:48 AM

సమన్వ

సమన్వయంతో మెలగాలి..

త్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరై నా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభు త్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికలు, జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం తగదు.

– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర

తీవ్రంగా ఖండిస్తున్నాం..

‘సాక్షి’ ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్‌నగర్‌ ప్రెస్‌ క్లబ్‌ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా స్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమై నది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్‌చారి,

ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

ప్రతిపక్ష పాత్ర పోషించాలి..

ర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసు లు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్‌ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చ ర్య. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.

– చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు,

టీయూడబ్ల్యూజే (హెచ్‌–143), నాగర్‌కర్నూల్‌

సమన్వయంతో మెలగాలి.. 
1
1/1

సమన్వయంతో మెలగాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement