కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..

Sep 12 2025 6:48 AM | Updated on Sep 12 2025 6:48 AM

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి.

– శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement