4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

May 29 2025 12:33 AM | Updated on May 29 2025 12:33 AM

4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

4న ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ది మహబూబ్‌నగర్‌ డిస్ట్రిక్ట్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీన జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.శ్యాంసుందర్‌గౌడ్‌, ఎల్‌.రవికుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–13, అండర్‌–15, అండర్‌–17, అండర్‌–19, సీనియర్‌, వెటరన్‌ విభాగాల్లో సెలక్షన్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లలో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌ను రిపోర్టు చేయాలని, మిగ తా వివరాల కోసం 98480 85211, 98660 33377, 96189 75795, 98669 28835 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చేనెల 1వ తేదీ నుంచి 17వ బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి (ఎఫ్‌ఏసీ) మధుసూదన్‌గౌడ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెంట్‌ తయారీ, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు (ఎంఎస్‌ ఆఫీస్‌), రిఫ్రిజిరేషన్‌, ఏసీ, ఫోన్‌ సర్వీసింగ్‌, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌ సెట్విన్‌ సంస్థ సర్టిఫికెట్‌ ఇస్తుందని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలని, దరఖా స్తు వెంట విద్యార్హత, ఆధారు కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో జతచేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మిగతా వివరాలకు కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

జిల్లా ‘మహిళా సమాఖ్య’ కార్యవర్గం ఎంపిక

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా స్వాతి(మిడ్జిల్‌), కార్యదర్శి గా సి.చంద్రకళ(కోయిల్‌కొండ), కోశాధికారిగా సి.అరుణ (సీసీకుంట)లను ఎంపిక చేశారు. ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులతో పాటు ఐకేపీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత కార్యవర్గం, కొత్త కార్యవర్గాల సభ్యులను సన్మానించారు. ఈ సందర్బంగా డీఆర్‌డీఓ ఏపీడీ జోజప్ప మాట్లాడుతూ సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఆర్థికంగా బలోపేతం కావడానికి కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా మహిళ సమాఖ్య కొత్త అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతానికి బాటలు వేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. డీపీఎంలు చెన్నయ్య, నాగమల్లిక, సలోమి పాల్గొన్నారు.

ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ, బీఎడ్‌ ఫలి తాలను బుధవారం పీయూ వీసీ శ్రీనివాస్‌ వి డుదల చేశారు. బీఫార్మసీ మొదటి సెమిస్టర్‌లో 5.52 శాతం, బీఎడ్‌ 3వ సెమిస్టర్‌లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్‌ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.

పీఆర్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈగా విజయ్‌కుమార్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా పంచాయతీరాజ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నాగర్‌కర్నూల్‌ జిల్లా పీఆర్‌ ఈఈ విజయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎస్‌ఈగా పనిచేసిన రామ్మోహన్‌రావు వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో.. ఆయన స్థానంలో విజయ్‌కుమార్‌ను ఇన్‌చార్జి గా నియమించడంతో బుధవారం ఆయన బా ధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యా లయం సిబ్బంది ఇన్‌చార్జి ఎస్‌ఈని సన్మానించి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఈఈలు లక్ష్మణ్‌రావు, డీఈ ప్రమోద్‌రావు, ఏఈలు రామకృష్ణ, అజీద్‌, సూపరిండెంటెంట్‌ అజిద్‌, రాఘవేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement