
తెలంగాణ చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి అని ఎంపీ డీకే అరుణ అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ పాల్గొని సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కవులే లేరని హేళన చేసినోళ్లకు అక్షర ఆధారాలతో బదులిచ్చిన మేధావి అన్నారు. 348 కవులతో కూడిన సాహిత్య సంచికను పరిచయం చేస్తూ గోల్కోండ కవుల పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలిసేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తూము ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి వేపూరి రాజేందర్రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, వెంకట్రాంరెడ్డి, సురేందర్రెడ్డి, కోటేశ్వర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, ఎల్లారెడ్డి, రవికిషన్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గోపికాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక చరిత్రలో
సురవరం ఒక అధ్యాయం
తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు ఏపీ.మిథున్రెడ్డి, సీజే బెనహర్, అవేజ్, గంజి ఆంజనేయులు, రమేష్ యాదవ్, సుధాకర్రెడ్డి, తిరుమల వెంకటేశ్ పాల్గొన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న
ఎంపీ డీకే అరుణ