గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా | Sakshi
Sakshi News home page

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా

Published Sat, Dec 23 2023 12:34 AM

- - Sakshi

కొత్తకోట రూరల్‌: గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట జాతీయ రహదారి 44పై చోటుచేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లా ఆలగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 21 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది.

శుక్రవారం తెల్లవారుజామున కనిమెట్ట సమీపంలోకి రాగానే బస్సుకు గేదే అడ్డం రావడంతో బస్సు డ్రైవర్‌ గురుదేవ్‌ గేదెను తప్పించబోగా బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సు తక్కువ వేగంతో ఉండటంతో బస్సులోని ప్రయాణికులు సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement