చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి

Dec 17 2025 7:17 AM | Updated on Dec 17 2025 7:17 AM

చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి

చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి

లోహితలో ఘటన

సంగెం: చలిమంటల్లో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహితలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తునికి రజిత, శివ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు రజిత తల్లిదండ్రులు బొమ్మెర కమల, యాకయ్య(65) కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి యాకయ్య చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డాడు. శరీరం కాలుతుండగా కేకలు వేయడంతో కూతురు రజిత, భార్య కమల వచ్చి చద్దర్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన 108లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement