
ఇంటిలోని ఏమూలలోనూ చీకటి లేకుండా చూడాలి..
ఈ రోజు దీపతోరణాలు వెలిగించే ఆచారం ఉంది. అందుకే దీపావళి పండుగగా పిలుస్తారు. ఈరోజున శ్రీమహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని భావిస్తారు. అందుకే ప్రజలు శ్రీమహాలక్ష్మీదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంటిలోపల, వెలుపల దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి, ఒత్తులు వేసి దీపాలు వెలిగించడం సర్వశ్రేష్టం. దీపాల వరుసను వృక్షాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. పురాతన శివాలయాలలో దీపదానం చేయడం దేవాలయాల్లో దీపాలు వెలిగించడం సంప్రదాయం. ఇంటిలోని ఏ మూలలోనూ చీకటిలేకుండా చూడాలి.