చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

Oct 1 2025 11:11 AM | Updated on Oct 1 2025 11:11 AM

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

గణపురంలో ఘటన

గణపురం: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం గ్రామానికి చెందిన దొంత రమేశ్‌ (32) తన స్నేహితుడితో కలిసి గణపసముద్రం చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రేఖ అశోక్‌ తెలిపారు. ఈ ఘటనతో గణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement