
‘పహల్గాం’పై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
న్యూశాయంపేట : పహల్గాం ఉగ్రఘటనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై మోదీ జవాబు చెప్పాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర బలగాలు.. మావోయిస్టుల మృతదేహాల ఎదుట నృత్యం చేయడం.. వారిని మోదీ, అమిత్ షా అభినందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, లేదంటే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు డబ్బులు లేవనడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, చక్రపాణి, వీరన్న, రమేశ్, వెంకట్, భానునాయక్, లింగయ్య, తిరుపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ