పెద్దవంగర: విద్యార్థుల్లో దాగిఉన్న క్రీడాప్రతిభను వెలికితీసేందుకే వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వేసవి శిక్షణ శిబిరాల పరిశీలన రాష్ట్ర బృందం జాయింట్ డైరెక్టర్ రాజీవ్, జీఈసీఓ శిరీష అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీఈఓ రవీందర్రెడ్డితో కలిసి పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో స్నేహతత్వం చదువుల్లో పోటీ పెరుగుతోందని తెలిపారు. సబ్జెక్టుల్లో భయం పోయి చదువుపై ఆసక్తి పెరుగుతోందన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ప్రభుత్వ పాఠశాల్లోనే కొనసాగుతున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా చదువుతోపాటు ఆట, పాటల్లో శిక్షణ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, శ్రీధర్, కరుణాకర్, రమేష్, పీఈటీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణ శిబిరాల పరిశీలన బృందం జేడీ రాజీవ్