ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దు

May 9 2025 1:05 AM | Updated on May 9 2025 1:05 AM

ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దు

ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దు

కేసముద్రం: కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం చేయకుండా ధాన్యాన్ని రవాణా చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని తాళ్లపూసపల్లి, కల్వల, మహముద్‌పట్నం, కోరుకొండపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, రవాణా విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ నిర్వాహకులు, సిబ్బంది, హమాలీలు, రైతులకు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వేగవంతంగా రైస్‌ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎర్రయ్య, ఏఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement