విద్యార్థులకు వినూత్నంగా బోధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వినూత్నంగా బోధించాలి

May 9 2025 1:02 AM | Updated on May 9 2025 1:02 AM

విద్యార్థులకు వినూత్నంగా బోధించాలి

విద్యార్థులకు వినూత్నంగా బోధించాలి

విద్యారణ్యపురి: విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా వినూత్నంగా విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాపరిశోధన శిఽక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్‌ గాజర్ల రమేశ్‌ కోరారు. కాజీపేట ఫాతిమా నగర్‌లోని బాలవికాస్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో గణితం, సోషల్‌ స్టడీస్‌ జిల్లా స్థాయి రిసోర్స్‌పర్సన్లకు మూడురోజులుగా శిక్షణ నిర్వహిస్తున్నారు. గురువారం ఆయన ఈశిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. డీఆర్‌పీలను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలతో ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటరాక్టివ్‌ ప్యానల్‌ బోర్డుల ద్వారా ఐసీటీని ఉపయోగిస్తూ బోధించడం వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఎస్‌సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డి నేటర్లు ఎల్లయ్య, గణపతి, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు రంగపాణిరెడ్డి, రిసోర్స్‌పర్సన్లు పాల్గొన్నారు.

టీచర్ల శిక్షణలోఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ గాజర్ల రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement