
భక్తులకు ఆర్టీసీ విస్తృత సేవలు
కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు. గురువారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తాత్కాలిక బస్స్టేషన్, ఘాట్లను సందర్శించారు. తాత్కాలిక బస్ స్టేషన్ వద్ద గ్రౌండ్ లెవలింగ్, విద్యుత్ పనులు, తాగునీరు, టాయిలెట్ల ఏర్పాట్లు సమీక్షించారు. హనుమకొండ – కాళేశ్వరం, మంచిర్యాల – కాళేశ్వరం, గోదావరిఖని – మంచిర్యాల – కాళేశ్వరం మార్గాల్లో స్పెషల్, రెగ్యులర్ సర్వీసులు నడిపేందుకు ప్లాన్ ఆపరేషన్పై చర్చించారు. ప్రస్తుతం హనుమకొండ, మంచిర్యాల, మంథని, గోదావరిఖని వంటి వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరం వరకు 67 ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా, వారి రవాణా సౌకర్యార్థం 400 బస్ ట్రిప్స్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆయనతో ఆర్ఎం భాను, డీఎం ఇందు తదితరులు ఉన్నారు.
● రద్దీ పెరిగితే 400 ట్రిప్పులు తిరిగేలా ప్రణాళికలు
● అన్ని రూట్లలో సర్వీసులు సిద్ధం:
కరీంనగర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్