సరస్వతీ పుష్కరాలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుష్కరాలకు పటిష్ట భద్రత

May 9 2025 1:02 AM | Updated on May 9 2025 1:02 AM

సరస్వతీ పుష్కరాలకు పటిష్ట భద్రత

సరస్వతీ పుష్కరాలకు పటిష్ట భద్రత

కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో గురువారం ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి పుష్కరాల పనుల్ని ఆయన పరిశీలించారు. ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై కాళేశ్వరం దేవస్థానం, ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ స్థలాలు, హెలిపాడ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్లు, పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాలకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారని, భక్తులకు ఇబ్బందులు కల్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

కాళేశ్వరాలయంలో పూజలు

మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి కాళేశ్వరం దేవస్థానానికి రాగా.. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి సన్మానించారు. ఆయన వెంట ఏఆర్‌ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్‌, కాటారం, భూపాలపల్లి, డీఎస్పీలు రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌ రావు, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, మహాదేవపూర్‌ సీఐ రామచందర్‌రావు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి

కాళేశ్వరంలో ఎస్పీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement