
ముగ్గురిపై పెంపుడు కుక్క దాడి
మహబూబాబాద్ రూరల్: ఏడేళ్ల చిన్నారితో పాటు కాపాడబోయిన బాలిక బంధువులపై పెంపుడు కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన మహబూబాబాద్ మండలం కేవులతండాలో గురువారం చోటుచేసుకుంది. కేవుల తండాకు చెందిన బాదావత్ బిక్యా తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అతడు ఆ కుక్కను ఇంట్లో కట్టేయకుండా వదిలేశాడు. ఇరుగుపొరుగువారు చెప్పినా వినలేదు. ఈక్రమంలో బుధవారం రాత్రి బానోత్ శ్రీకాంత్, అరుణ దంపతుల ఏడేళ్ల కుమార్తె హర్షిత వీపుభాగంలో కుక్క దాడి చేసి గాయపర్చింది. తల్లిదండ్రులు స్థానికంగా వైద్యం అందించారు. ఉదయం చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా మళ్లీ కరిచింది. గమనించిన తండావాసులు, బాలిక బంధువులు బాదావత్ కిషన్, రక్మీ దంపతులు కుక్కను తరిమేసి హర్షిత గాయాల్ని కడుగుతుండగా.. కుక్క మళ్లీ వచ్చి కిషన్, రక్మీ దంపతులను కరిచింది. తీవ్రగాయాలవడంతో స్థానికులు వారిని చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
పెంపుడు కుక్క యజమానిపై కేసు
పెంపుడు కుక్క దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపర్చిన ఘటనలో కుక్కను పెంచుతున్న బాదావత్ బిక్యాపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపిక గురువారం రాత్రి తెలిపారు.
చిన్నారికి తీవ్ర గాయాలు
కాపాడబోయిన వారిపైనా..

ముగ్గురిపై పెంపుడు కుక్క దాడి